సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాధ్ ఈ లోకాన్ని వీడిన విషాదం మరువక ముందే మరో ప్రముఖ గాయని వాణీ జయరాం శనివారం ఉదయం చెన్నెలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు కలైవాణి. 1945 నవంబరు 30న తమిళనాడులోని వెల్లూరులో ఆమె జన్మించారు. ఆరుగురు అక్కాచెళ్లెల్లలో ఆమె ఐదోవారు.
కర్ణాటక సంగీతంలో వాణీ జయరాం దిట్ట. ఐదేళ్ల వయసులోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న వాణీ ఎనిమిదో ఏటనే సంగీత కచేరీలు ఇచ్చి ఔరా అనిపించారు. అటుపై పలువురు సంగీత విద్వాంసుల శిక్షణలో మరింత సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడారు.
క్రమంగా సినిమాల్లో పాటలు పాడాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయాక భర్త జయరాం ఆమెను ప్రోత్సహించారు. 1970లో హిందీలో గుడ్డీ సినిమాలో తొలి పాట పాడారు. అలా మొదలైన ఆమె పాటల ప్రయాణం 14 భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడిన ఆమె సంగీత రంగానికి చేసిన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మూడు సార్లు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్న వాణి జయరామ్ మృతి యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు నివాళులర్పించారు.
173336 874118You got a really good internet site, Gladiolus I discovered it by means of yahoo. 95136
521203 340371I surely did not realize that. Learnt something new proper now! Thanks for that. 375880