New Parliament: నూతన పార్లమెంట్ (New Parliament) భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ (PM Narendra Modi) సంప్రదాయబద్ధంగా కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్ (Sharukh Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), రజినీకాంత్ (Rajinikanth), అనుపమ్ ఖేర్ ట్వీట్స్ చేశారు. వారి ట్వీట్స్ ను ప్రధాని మోదీ రీట్వీట్ చేశారు.
నిన్న ప్రధాని పార్లమెంటుకు సంబంధించి నేపథ్య సంగీతంతో మాత్రమే పోస్ట్ చేసిన వీడియోకు ప్రజలు తమ అభిప్రాయాలను వాయిస్ జోడించి ట్వీట్ చేయాలని కోరారు. కొన్నింటిని రీట్వీట్ చేస్తానని.. వీడియోలకు #myparliamentmypride హ్యాష్ ట్యాగ్ జోడించాలని సూచించారు.
షారుఖ్, అక్షయ్ హిందీలో, రజినీకాంత్ తమిళంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొత్త పార్లమెంట్ భవనం మన ఆశల కొత్త ఇల్లు.. 140కోట్ల మందిని కుటుంబంగా ఉంచిన రాజ్యాంగాన్ని సమర్ధించే వారి ఇల్లుగా షారుఖ్ అభివర్ణించారు. అద్భుతంగా వివరించారని ప్రధాని కితాబిచ్చారు. అక్షయ్ ట్వీట్ కు హిందీలో, రజినీకాంత్ ట్వీట్ కు తమిళంలోనే ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.