లవ్ స్టోరీ .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచ్చమైన ప్రేమకథా చిత్రం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుతుంది. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల, సాయి పల్లవిల మ్యాజిక్ మరోసారి రీపీట్ కానుంది అంటూ ఇప్పటికే సినిమా వర్గాల్లో క్రేజ్ నెలకొంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో డేట్ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
దానికి కారణం ఏమిటంటే .. ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా షూటింగ్ జరగడం లేదట. ఈ మద్యే ఆర్మూర్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసారు .. అది అనుకున్నట్టు కాకుండా డిలే అయ్యింది.. దాంతో నెక్స్ట్ హైదరాబాద్ లో జరిపే షెడ్యూల్ పై ఆ ఎఫెక్ట్ పడడం, ఆ తరువాత దుబాయ్ షెడ్యూల్ .. ఇలా మిగతా షూటింగ్ కు కూడా టైం పట్టేలా ఉండడంతో సినిమా ఏప్రిల్ 14 న కాకుండా పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజ నిజాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
కుల వ్యవస్థకు సంబందించిన సంఘటనలతో ఈ సినిమా ఉంటుందని, సున్నితమైన భావోద్వేగాలతో శేఖర్ కమ్ముల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. మరి ఇప్పటికే కులాల వ్యవస్థ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి .. మరి ఇందులో శేఖర్ కమ్ముల ఎలాంటి సంఘటనలతో కథను చెబుతాడో అన్నది తెలియాల్సి ఉంది.