Switch to English

వైఎస్‌ జగన్‌ దోస్త్‌ జీవీఎల్‌ నోటికి తాళం పడేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

‘రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం.. కేంద్రానికి సంబంధం లేని విషయం..’ అంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు. అసలు రాజధాని అంశం రాజ్యాంగంలోనే లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ రాజదాని అంటే ఇంత వెటకారం అయిపోయింది చాలామందికి.!

అన్నట్టు, కేంద్రం కూడా రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఇటీవలే పార్లమెంటు సాక్షిగా తేల్చేసింది. కానీ, హైకోర్టు మాత్రం, రాజధాని వ్యవహారంపై కేంద్రం ఎందుకు మౌనంగా వుంటోంది.? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ ప్రశ్నతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తెరవెనుకాల సహాయ సహకారాలు అందిస్తోన్న జీవీఎల్‌ నరసింహారావుకి నోటికి తాళం పడిపోయినట్లేనేమో.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి విభజన చట్టంలో పూర్తి స్పష్టత వుంది. కొత్త రాజధాని కోసం కేంద్రం కమిటీ వేస్తుందనీ, ఆ కమిటీ సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్నది ఆ స్పష్టత సారాంశం. శివరామకృష్ణన్‌ కమిటీ ఏర్పాటయ్యింది.. అప్పట్లో చంద్రబాబు సర్కార్‌, అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది కూడా.

మరోపక్క, 2024 వరకూ హైద్రాబాద్‌, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కీ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుందని విభజన చట్టం చెబుతోంది. అంటే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పట్ల పూర్తి బాధ్యత వుందనే కదా అర్థం. సో, ఇప్పుడిక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఒకటి అమరావతి, ఇంకోటి కర్నూలు.. మరొకటి విశాఖపట్నం. అసలు రాజధాని అనే ప్రస్తావన రాజ్యాంగంలో లేదని ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పాక, మూడు రాజధానుల చర్చ ఏంటి.? అన్నదానికి తొలుత సమాధానం వెతకాల్సిన బాధ్యత కేంద్రం మీద వుంది.

అధికారంలో వున్నవారు అన్నిటినీ తమకు అనుకూలంగా అన్వయించేసుకోవడం కొత్తేమీ కాదు. కానీ, చట్టాలు, నిబంధనలు.. వంటివాటిపై ప్రజలకు ఖచ్చితమైన వాస్తవాలు తెలిసి తీరాలి. అది న్యాయస్థానాల జోక్యంతో జరుగుతుందని ఆశిద్దాం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు మాట్లాడకూడదు.?

న్యాయస్థానం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. అదీ వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...