సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సుదీర్ఘ చర్చ నిర్వహించాయి. అనంతరం వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించాయి.
సంక్రాంతి సినిమాల సంబరానికి సినిమాలు ముస్తాబయ్యాయి. అయితే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడం, థియేటర్ల సమస్య చర్చనీయాంసమైంది.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు లాభాలు, థియేటర్ల సమస్యపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..
‘సోషల్ మీడియా వెబ్ సైట్స్, న్యూస్ ఛానల్స్ ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉంటాయి. కానీ.. కొన్ని సార్లు గాసిప్స్ ను న్యూస్ గా ఇవ్వడం ఇండివిడ్యువల్ డ్యామేజ్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న విపరీతమయిన పోటీని అర్థం చేసుకుని సంక్రాంతి బరి నుంచి కాని 15 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ మీట్లో మేము తీసుకున్న డెసిషన్ కి ఒప్పుకుని వెనక్కి తగ్గిన ఈగల్ టీంకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఛాంబర్ అడగగానే నిర్మాత విశ్వ ప్రసాద్, వివేక్, రవితేజ ఒప్పుకోవడం అభినందించే విషయం. దీంతో మిగిలిన నాలుగు సినిమాలకి, స్క్రీన్స్ సంఖ్య, బిజినెస్ చేసుకునే అవకాశం లభించిందని అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల నేపథ్యంలో నిర్మాతలు సహకరించి తమ తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి తగ్గిన ఈగల్ టీమ్ కృతజ్ఞతలు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ సంక్రాంతి సినిమా పోటీలో ఎవరూ ఇబ్బందిపడకుండా చూడటమే మా ఆలోచన. అందరి సినిమాల కోసం ఆలోచించి ఛాంబర్ తీసుకున్న నిర్ణయం ‘ అని అన్నారు.
సమావేశంలో.. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ్ రెడ్డి, సునీల్ నారంగ్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్, నిర్మాతలు నిరంజన్ రెడ్డి వివేక్ కూచిబొట్ల చిత్తూరు శ్రీను, వెంకట్ బోయినపల్లి పాల్గొన్నారు.