చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా’ ప్రస్తుతం స్టేటస్ ఏంటీ.? షూటింగ్కి అయితే గుమ్మడి కాయ కొట్టేశారు. కానీ, ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చాలా కష్టం. ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతవరకూ వచ్చాయి.? అసలు అనుకున్న టైంకే ‘సైరా’ విడుదలవుతుందా.? లేదా.? మెగా ఫ్యాన్స్ని విపరీతంగా టెన్షన్ పెట్టేస్తున్న ప్రశ్నలివి.
అసలు డీటెయిల్స్లోకి వెళితే, ‘సైరా’కి సంబంధించి డీఐ వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తోందట. కలర్ గ్రేడింగ్ చేస్తున్నారట. సినిమాలో ఓ నైట్ ఎఫెక్ట్ సీన్ ఉండబోతోందట. ఆ సీన్కి సంబంధించిన వర్క్ చేస్తున్నారట. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందనీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చెబుతున్నారు. ఈ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే సీన్ ఇది.. అంటూ ఆయన సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు.
ఇండియాలో టాప్ టెక్నీషియన్స్లో రత్నవేలు ఒకరు. మామూలుగా ఆయన తన సినిమాలకు సంబంధించి ఇంపార్టెంట్ అంశాల్ని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ, ఏ సీన్ గురించి ఆయన ఇంత గొప్పగా ఎప్పుడూ చెప్పిన దాఖలాల్లేవు. అంటే ఈ సీన్ని ఆయన ఎంత ఫీలై తీశారో, ఆ సీన్ ఇంకెంత బాగా తెరపై ఆవిష్కృతమైందో అర్ధం చేసుకోవచ్చు. రత్నవేలు ఎగ్టైట్మెంట్ చూస్తుంటే, ఈ సీన్ గొప్పతనమేంటో ఊహాత్మకంగా కళ్లలో మెదులుతున్నట్లే అనిపిస్తోంది.
సినిమాటోగ్రఫీలో రత్నవేలు పనితనమే వేరు. గతంలో ఆయన ‘రంగస్థలం’ సినిమాకి వర్క్ చేయడం ఆ సినిమా ఘనవిజయం సాధించడం తెలిసిన విషయమే. ‘రంగస్థలం’ ఓ స్పెషల్ మూవీ. ఇలాంటి స్పెషల్ మూవీస్ తెరకెక్కించడంలో ఆయన స్పెషలిస్ట్. అక్టోబర్ 2న ‘సైరా’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రామ్చరణ్ ఈ సినిమాకి నిర్మాత కాగా, సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. బిగ్బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్నా, విజయ్ సేతుపతి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. తెలుగు నేలపై తొలి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఈ ‘సైరా నరసిహారెడ్డి’.