ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన కృష్ణా రీజియన్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. 2019-20 కంటే గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. ఈ రీజియన్ లోని ఏ ఒక్క డిపో కూడా లాభాల్లో లేదు. ఎప్పుడూ లాభాల్లో ఉండే విజయవాడ, ఆటోనగర్ బస్ డిపోలు కూడా గతేడాది నష్టాలు చవిచూశాయి.
మొత్తమ్మీద ఈ రీజియన్ లోని 14 బస్ డిపోలు కలిసి రూ.338.39 కోట్లు నష్టపోయాయి. కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు ఆరు నెలలపాటు బస్సులు నడవలేదు. అనంతరం బస్సులు తిరగడం మొదలైనా.. తెలంగాణ ఆర్టీసీతో ఒప్పందం కుదరడంలో జాప్యం జరగడం కూడా ఆర్టీసీ ఆదాయంపై ప్రభావం చూపింది. దీంతో ఆదాయం భారీగా తగ్గి.. నష్టాలు వచ్చాయి.
అయితే, దాదాపు ఆరునెలలపాటు బస్సులు తీయకపోవడం వల్ల ఖర్చు ఉండదని.. వేతనాలు, ఇతరత్రా అంశాలు మాత్రమే వ్యయం అవుతాయని పలువురు అంటున్నారు. పైగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినందున వారి వేతనాలు కూడా ఖర్చులో చూపే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంతగా నష్టాలు రావడానికి కారణాలు ఏమిటనేది అంతుచిక్కడంలేదు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తోంది.
838163 844182for yet yet another great informative post, Im a loyal reader to this weblog and I cant stress enough how significantly valuable data Ive learned from reading your content material. I genuinely appreciate all of the hard work you put into this fantastic weblog. 528140
808155 270800Previously you need to have highly effective web business strategies get you started of obtaining into topics suitable for their web-based organization. educational 7474