దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా ఉందో.. వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం కూడా అంతే వేగంగా ఉంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా భారత్ 90 రోజుల్లోనే 12 కోట్ల డోసులు ఇచ్చి రికార్డు సృష్టించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అమెరికాకు 97 రోజులు పడితే.. చైనా ఇందుకు 108 రోజుల సమయం తీసుకుంది. దీంతో వ్యాక్సినేషన్ పై భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటికి దేశం మొత్తం మీద 90 రోజుల్లో 12.26 కోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిందని ప్రకటించింది. ఇందులో ఆరోగ్య సిబ్బందిలో 91 లక్షల మంది తొలి డోస్ తీసుకోగా.. 57 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో 1.12కోట్ల మంది తొలి డోస్ తీసుకుంటే.. 55 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలోని 8 రాష్ట్రాల్లో 59.5 శాతం టీకా ప్రక్రియ నమోదైందని తెలిపింది.
104770 175498Thank you a great deal for giving everyone an extraordinarily unique possiblity to check ideas from here. 273655
36759 849564Outstanding post, I think individuals ought to learn a great deal from this web internet site its rattling user genial . 274037