పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లక్షకు పైగా కరోనా టెస్టులు చేసేసింది. తెలంగాణ లెక్క ఇంకా 20 వేలకు అటూ ఇటూగానే వుందట. ఇంతకీ, ఈ మతలబు ఏంటట.? ఇదే అంశం చుట్టూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రానికి ఓ లేఖ రాశారు. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయన్నది బండి సంజయ్ ఆరోపణ. కేంద్రం తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన తన లేఖలో కేంద్రాన్ని కోరారు. పరీక్షలు తక్కువగా చేస్తూ, తెలంగాణలో కరోనా తీవ్రతను తక్కువ చేసి చూపిస్తోందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. నిజమేనా.?
తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు తక్కువగా చేస్తున్నది కరోనా వైరస్ తీవ్రత కన్పించనీయకుండా చేసేందుకేనా.? సగటు తెలంగాణ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఈ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ‘మేం అడ్డగోలుగా పరీక్షలు చేయడంలేదు.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు మాత్రమే పరీక్షలు చేస్తున్నాం..’ అని తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పైగా, ‘మేం కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ కూడా కర్నూలులాగానో, గుంటూరులాగానో తయారయ్యేది..’ అంటూ ఈటెల రాజేందర్ నిన్న ఘాటైన పొలిటికల్ బాంబు కూడా పేల్చారు.
దాంతో, ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడ్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు ఈటెల రాజేందర్ని ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క, తెలంగాణ మద్దతుదారులు, ఏపీలోని అధికార పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ముదురుతున్న వివాదానికి తోడు, తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రానికి రాసిన లేఖతో కరోనా టెస్టులపై రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవల్కి వెళుతోంది. ఇంతకీ, తెలంగాణలో తక్కువ పరీక్షలు జరగడంపై కేంద్రం స్పందిస్తుందా.? తక్కువ పరీక్షలు చేయడంతోనే కరోనా కేసులు తెలంగాణలో తక్కువగా నమోదవుతున్నాయా.? ఏమో, ఏం జరుగుతోందో.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిందే.
181414 367631The vacation trades offered are evaluated a variety of inside the chosen and simply excellent value all around the world. Those hostels are normally based towards households which youll locate accented via charming shores promoting crystal-clear fishing holes, concurrent of ones Ocean. Hotels Discounts 293623