టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, ఇటీవల నటి పవిత్రను పెళ్లాడబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతకొంత కాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉంటున్నారని సినీ వర్గాల్లో వార్తలు వచ్చినా, వారు వాటిపై సైలెంట్గా ఉన్నారు. ఇక న్యూ ఇయర్ రోజున ఓ వీడియోతో వీరిద్దరు తమ రిలేషన్ను బయటపెట్టేశారు. త్వరలోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసుకోబుతున్నట్లు అనౌన్స్ చేశారు.
అయితే నరేష్-పవిత్రాల పెళ్లిపై తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మండిపడ్డారు. తన భర్త నరేష్ వ్యక్తిత్వం గురించి తనకు ముందునుండీ తెలుసని.. అప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయాడని.. అయితే పవిత్రతో ఆయన రిలేషన్లో ఉన్నాడని తాను ముందునుండీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని.. కానీ, ఇప్పుడు ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో ఆయన బుద్ధి ఎలాంటిదో అందరికీ అర్థం అయ్యిందంటూ ఆమె మండిపడింది. వారిద్దరి పెళ్లికి తాను పూర్తి వ్యతిరేకమని.. తాను ఈ పెళ్లిని ఎలాగైనా జరగనివ్వకుండా చూస్తానంటూ చెప్పుకొచ్చింది.
అంతేగాక, తన భర్త వేరొక స్త్రీని వివాహం చేసుకోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని.. ఆయనకు తాను ఎప్పటికీ విడాకులు ఇవ్వనంటూ చెప్పుకొచ్చింది. కాగా, నరేష్తో తనకు కుమారుడు ఉన్నాడని.. అతడిని పెంచేందుకు మాత్రం తనకు డబ్బులు అవసరం ఉండటంతో, నరేష్ను ఆ డబ్లులు ఇవ్వాలని తాను కోరుతున్నట్లుగా రమ్య రఘుపతి తెలిపారు. మరి రమ్య చేసిన తాజా కామెంట్స్పై నరేష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
There is definately a lot to find out about this subject. I like all the points you made
Great information shared.eally enjoyed reading this post thank you author for sharing this post.