Ayodhya: దేశంలో హిందూత్వ నినాదానికి ఊపిరిలూదిన ప్రముఖుల్లో బీజీపీ (BJP) కురువృద్ధులు ఎల్.కే.అద్వాణీ (L.K.Advani), మురళీ మనోహర్ జోషి (Murali Manohar Joshi) ముందు వరుసలో ఉంటారు. రామ మందిరం (Ayodhya Ram mandir) కోసం దశాబ్దాల క్రితం జరిపిన రథయాత్రల్లో వీరి పాత్రే కీలకం.. అప్పట్లో ఓ సంచలనం. దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. అటువంటి ప్రముఖులకు 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభానికి హాజరుకావడం లేదు. వారి వయసు దృష్ట్యా చేసిన విజ్ఞప్తికి వారు అంగీకరించినట్టు రామ మందిరం ట్రస్టు వెల్లడించింది.
‘అద్వాణీ వయసు 96, మురళీ మనోహర్ జోషి వయసు 89. వీరిద్దరూ పెద్ద వయస్కులు. వారి ఆరోగ్యాన్ని, వయసును దృష్టిలో ఉంచుకుని రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశాం. పరిస్థితుల దృష్ట్యా మేమే చేసిన విజ్ఞప్తిని వారిరువురూ అంగీకరించార’ని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మాజీ ప్రధాని దేవెగౌడను వేడుకలకు ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలిపారు.
I don’t even know how I ended up here, but I thought this post
was great. I don’t know who you are but definitely you
are going to a famous blogger if you aren’t already 😉 Cheers!