ఎనర్జిటిక్ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో తెరపై తనని సరికొత్తగా ఆవిష్కరించుకొని భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ తో పాటు కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమాలో ఒకే పాత్రలో రెండు షేడ్స్ చూపిస్తే ఇప్పుడు డ్యూయెల్ రోల్లో మాస్ అండ్ క్లాస్ గా కనిపించనున్న సినిమా ‘రెడ్’.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ మరియు టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ సినిమాకి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం రెడ్ సినిమా ఆంధ్ర రైట్స్ ని అన్ని ఖర్చులు కలుపుకొని 12 కోట్లకి కొను గోలు చేశారు.
అలాగే సీడెడ్ లో సుమారు 4.3 కోట్లకి కొనుగోలు చేశారు. ఆంధ్ర ప్లస్ సీడెడ్ కలుపుకుంటే సుమారు 16 కోట్ల బిజినెస్ అయ్యింది. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆంధ్ర + సీడెడ్ లో సుమారు 18 కోట్లకి పైనే చేసింది. అందుకే ఈ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ అవుతోంది.
ఇంకా నైజాం డీల్ క్లోజ్ కావాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ నైజాంలో 13 కోట్ల షేర్ సాధించడంతో ఈ చిత్ర టీం నైజాంలో భారీ ప్రైజ్ చెబుతోంది. మరి ఆ రేటుకి ఎవరు ఫైనల్ చేసుకుంటారో చూడాలి. మరోవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన ఇప్పటికే మార్చి లో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 9 వరకూ ఈ కరోనా ఎఫెక్ట్ ఇలానే కొనసాగితే సినిమా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఆ టైంకి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల తర్వాత రామ్ – డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తడం’ సినిమాకి రీమేక్.
268910 427941I enjoy your writing type, do maintain on writing! Ill be back! 146335
5261 150710I like this weblog so significantly, saved to my bookmarks . 705866