దేశ వ్యాప్తంగా కరోనాను మహమ్మారిగా గుర్తించారు. జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ వందల.. వేల ప్రాణాలను బలిగొనే రోగాలను మహమ్మారిగా గుర్తిస్తారు. మహమ్మారిపై యుద్దం ప్రకటించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం అన్ని సిద్దం అవుతాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిపై యుద్దం జరుగుతోంది. ఈ సమయంలోనే బ్లాక్ ఫంగస్ అనే భయంకర వ్యాది మొదలు అయ్యింది. కరోనా నుండి కోలుకున్న వారికి ఇది ఎక్కవుగా సోకుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించకుంటే మృతి చెందడం ఖాయం.
బ్లాక్ ఫంగస్ చాలా సీరియస్ ఇష్యూ అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సయమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే బ్లాక్ ఫంగస్ ను మహమ్మారి జాబితాలో చేర్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్ లో ఇప్పటికే వందకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవ్వగా మరో వారం రోజుల్లోనే ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
880763 627481I will tell your buddies to check out this website. .Thanks for the post. 336973
749765 108293Rattling clean internet site , thanks for this post. 431137
665158 24486Your writing taste has been surprised me. Thanks, quite great post. 18947
288463 900783A lot of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 54461