కరోనాతో మానవత్వం చచ్చి పోతుంది, ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం మానేశారు. పక్కవారి నుండి మాకు ఎక్కడ కరోనా వస్తుందో అని కనీసం పలకరింపులు కూడా లేవు. ఇలాంటి సమయంలో కరోనా వారిద్దరికి మాత్రం మంచి చేసింది. కరోనా పాజిటివ్ అవ్వడంతో కలిసి వారిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుని భార్య భర్తలు అయ్యారు. కరోనా కారణంగా వారిద్దరు ఇప్పుడు దంపతులుగా మారడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుంటూరు జిల్లా చికలూరిపేట అమ్మాయి ప్రకాశం జిల్లా పర్చూరు అబ్బాయికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వారిద్దరిని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేశారు. ఇద్దరిది పక్క పక్క బెడ్. ఇద్దరు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అవ్వడంతో మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ దొరికాయి. వారిద్దరు కరోనా నుండి బయట పడే సమయానికి ఇద్దరి మనసులు కలిశాయి.
రెండు వారాల పాటు కరోనా కారణంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వారిద్దరు బయటకు వచ్చిన తర్వాత వారి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం, కులాలు ఒక్కటే అవ్వడం ఇద్దరు కూడా సాఫ్ట్ వేర్ ఫీల్డ్లో ఉండటం వంటి కారణాలతో పెళ్లికి గ్రీన్ స్నిగల్ ఇచ్చారు. ఈనెల 25వ తారీకున వీరిద్దరి పెళ్లి పొన్నూరులోని ఒక దేవాలయంలో జరిగింది. ప్రస్తుతం గుంటూరు ప్రకాశం జిల్లాలో ఈ పెళ్లి ట్రెండ్డింగ్ టాపిక్.
200896 418027Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and site owners alike! 385644
938483 462501Following study a couple of with the blog posts on your personal web site now, we really like your way of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware in case you agree. 744087