Switch to English

అరగంటలో కోవిడ్‌ బెడ్‌.. ఏపీలో సాధ్యమేనా జగన్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటేశాయి. గత కొద్ది రోజులుగా దేశంలో అత్యధికంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. టెస్టుల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ ముందంజలోనే వున్నా, కొత్త కేసుల నమోదు.. కొత్త మరణాల నమోదులోనూ అదే వేగం కన్పిస్తుండడం దురదృష్టకరం. రాష్ట్రంలో కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రుల్లో వసతుల లేమి, ఇతరత్రా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు, మీడియా కథనాలు వెలుగు చూస్తున్న విషయం విదితమే. అయితే, కరోనా వైద్య చికిత్సలో చాలా రాష్ట్రాలకు తాము ఆదర్శంగా వున్నామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

తాజాగా కరోనా వైరస్‌ విషయమై అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాతో బాధపడుతున్న వ్యక్తి కోవిడ్‌ ఆసుపత్రిలో బెడ్‌ కావాలని కోరితే, అరగంటలో బెడ్‌ సమకూర్చాలి’ అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేయడమే కాదు, ఆ పరిస్థితి లేకపోతే దానికి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని అన్నారు. అంతేనా, ‘అది మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం.. మనం వారికి తగిన వైద్యం అందించలేకపోతే అది నేరం కిందే లెక్క..’ అని అభిప్రాయపడ్డారు వైఎస్‌ జగన్‌.

అయితే, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులేంటి.? అన్నది ముఖ్యమంత్రి జగన్‌కి తెలియదని ఎలా అనుకోగలం.! సమయానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలో ఓ కరోనా బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన వైనం గురించి చూశాం. సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడంతో ఓ కరోనా బాధితుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోతే, గంటల తరబడి అతన్ని ఎవరూ తాకడానికి కూడా వెనుకాడారు. ఇక, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోందిగానీ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాస్క్‌ ధరించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు అందిస్తామంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఇప్పటిదాకా ఎంతమందికి ఆ ఉచిత మాస్క్‌లు అందాయి.? అన్నదానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు మెదపట్లేదు.

ఇవన్నీ ఓ ఎత్తు.. అధికార పార్టీ నేతలు, కరోనా నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుండడం వల్ల కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలూ లేకపోలేదు. మొత్తమ్మీద, మాటలు కోటలు దాటుతున్నాయ్‌.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...