ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటేశాయి. గత కొద్ది రోజులుగా దేశంలో అత్యధికంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ది రెండో స్థానం. టెస్టుల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలోనే వున్నా, కొత్త కేసుల నమోదు.. కొత్త మరణాల నమోదులోనూ అదే వేగం కన్పిస్తుండడం దురదృష్టకరం. రాష్ట్రంలో కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో వసతుల లేమి, ఇతరత్రా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు, మీడియా కథనాలు వెలుగు చూస్తున్న విషయం విదితమే. అయితే, కరోనా వైద్య చికిత్సలో చాలా రాష్ట్రాలకు తాము ఆదర్శంగా వున్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది.
తాజాగా కరోనా వైరస్ విషయమై అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాతో బాధపడుతున్న వ్యక్తి కోవిడ్ ఆసుపత్రిలో బెడ్ కావాలని కోరితే, అరగంటలో బెడ్ సమకూర్చాలి’ అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేయడమే కాదు, ఆ పరిస్థితి లేకపోతే దానికి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని అన్నారు. అంతేనా, ‘అది మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం.. మనం వారికి తగిన వైద్యం అందించలేకపోతే అది నేరం కిందే లెక్క..’ అని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్.
అయితే, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులేంటి.? అన్నది ముఖ్యమంత్రి జగన్కి తెలియదని ఎలా అనుకోగలం.! సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలో ఓ కరోనా బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన వైనం గురించి చూశాం. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఓ కరోనా బాధితుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోతే, గంటల తరబడి అతన్ని ఎవరూ తాకడానికి కూడా వెనుకాడారు. ఇక, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోందిగానీ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాస్క్ ధరించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మాస్క్లు అందిస్తామంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటిదాకా ఎంతమందికి ఆ ఉచిత మాస్క్లు అందాయి.? అన్నదానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు మెదపట్లేదు.
ఇవన్నీ ఓ ఎత్తు.. అధికార పార్టీ నేతలు, కరోనా నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుండడం వల్ల కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలూ లేకపోలేదు. మొత్తమ్మీద, మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి.
👉కచ్చితంగా కరోనా పేషంట్ కు ప్రతి ఒక్కరికి అరగంట లోపు బెడ్ దొరకాలి..బెడ్ దొరకటంలేదు అనేమాట ఎక్కడ కూడా రాకూడదు-#Jagan
👉మాటలేమో ఘనం.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులేమో దారుణం
👉ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి కరోనా కట్టడికై చర్యలు తీసుకోవాలంటున్న సామాన్యులు#Janasena #TDP pic.twitter.com/HH2rcSkn2P
— TeluguBulletin.com (@TeluguBulletin) July 28, 2020
320382 946563Someone essentially assist to make severely posts I may well state. That is the really very first time I frequented your site page and so far? I surprised with the analysis you made to create this certain submit incredible. Magnificent task! 512374