డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తన పూరి మ్యూజింగ్స్ పేరుతో ప్రతి రోజు ఏదో ఒక టాపిక్ తో జనాల ముందుకు వస్తున్నాడు. తాజాగా రాబోయే కాలంలో జరుగబోతున్న విషయాల గురించి చర్చించాడు. ఈసారి పూరి భవిష్యత్తులో మాంసాహారం గురించి మాట్లాడాడు. మనం ప్రతి రోజు ఆహారం కోసం మూడు బిలియన్ ల జంతువులను చంపేస్తున్నాం.
కోళ్లు, చేపలు, పందులు ఇతర జంతువులు అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా 3 బిలియన్ ల జంతువులను చంపుతున్నాం అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే జంతువులను చంపకుండా మాంసంను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. రుచిలో ఎలాంటి మార్పు లేకుండా సహజమైన మాంసం కంటే మరింత ఎక్కువ ఆరోగ్య దాయకంగా ల్యామ్ మాంసం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ లో ఒక హోటల్ ఈ మాంసంను మొదలు పెట్టింది.
ఇది చదవండి: పూరి జగన్నాధ్ మామూలోడు కాదు.. ‘పూరి మ్యూజింగ్స్’తో కూడా రికార్డులే..
2040 వరకు ప్రపంచం మొత్తం కూడా ఈ మాంసం విస్తరిస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా జంతువులను చంపి తినకుండా ల్యాబ్ మాంసంకు అలవాటు పడిపోతారు అంటూ పూరి పేర్కొన్నాడు. జంతువులు ఎలాంటి ప్రదేశాల్లో పెరుగుతున్నాయి.. ఎలాంటి ఆహారం తింటున్నాయి అనేది మనకు తెలియదు. కాని ల్యాబ్ లో చేసేది మాత్రం నూటికి నూరు పాళ్లు ఆరోగ్యవంతమైనదిగా పూరి చెప్పాడు. ఇలాంటి మాంసపు యూనిట్లకు అవకాశం కల్పించి అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వంను పూరి కోరాడు.
992640 412373I recognize there is a superb deal of spam on this web site. Do you require aid cleaning them up? I might aid in between courses! 99581
377294 643842Im sure your publish and internet site is incredibly constructed 26475
346314 56197I dont typically comment but I gotta state thanks for the post on this fantastic one : D. 304243