హైదరాబాద్ అంకుషాపూర్ వద్ద సగం కాలిన మృతదేహంను గుర్తించిన స్థానికులు పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చనిపోయిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నించారు. కాని మృతురాలు మొహంను పెట్రోల్ పోసి తగులబెట్టడంతో గుర్తించడం కష్టం అయ్యింది.
అయితే ఆమె చీర కొంగులో ఒక చిన్న చిట్టి ఉంది. ఆ చిట్టి లో ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ వ్యక్తిని ప్రశ్నించగా హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. అయితే ఆమె ఎవరు అనే విషయమై క్లారిటీ ఇచ్చాడు. అలా కేసును ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని చనిపోవడానికి ముందు ఏ వ్యక్తితో ఆమె కలిసిందో తేల్చారు.
చనిపోయిన ఆ మహిళ వెంకటమ్మగా గుర్తించిన పోలీసులు ఎవరితో అయితే ఆమె ఆటో ఎక్కి వెళ్లిందో అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించి చివరకు పట్టుకున్నారు. వెంకటమ్మ హత్య కేసులో అతడిని పట్టుకుంటే నోరు విప్పిన అతడు ఏకంగా 16 హత్యలు చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
16 మందిని కూడా అత్యంత పాశవికంగా చంపేసినట్లుగా చెప్పుకొచ్చాడు. సైకో కిల్లర్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడిని ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
551661 898281Hi there! Nice stuff, please do tell me when you lastly post something like this! 401815