దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా భారీగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. సామాన్యులు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. మద్యతరగతి జీవులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో వంద మంది ఇండియన్ కుబేరుల ఆదాయం భారీగా పెరిగింది. కరోనాతో సంబంధం లేకుండా మార్చి నుండి ఇప్పటి వరకు వారి సంపాదన ఏకంగా 13 లక్షల కోట్లు పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఈ స్థాయిలో కరోనా సమయంలో పెరగడ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే విషయం.
ఒక వైపు ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో దేశంలోని అంబానీతో పాటు పలువురు దిగ్గజ వ్యాపారవేత్తల ఆదాయం భారీగా పెరిగింది. ఆదాయం పెరిగిన వారు ఒక మద్య తరగతి సామాన్యుడిని ఆదుకోవాలంటే 15 కోట్ల మందికి దాదాపుగా లక్ష రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది. నైపుణ్య కార్మికులు కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ప్రస్తుతం అంబానీ సంపాదిస్తున్న ఒక్క సెకను డబ్బుతో సామాన్యుడి కుటుంబం మూడున్నర ఏళ్లు నిశ్చితంగా ఉండ వచ్చు. అంతగా ఆయన సంపాదన ఉంది. ఇంకా పలువురు కుబేరుల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి.
692549 509929Hiya! awesome blog! I happen to be a everyday visitor to your internet site (somewhat much more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more to come! 874341