మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఏకంగా ఏడుసార్లు ఆయనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించడం కలకలం రేపుతోంది. కాల్ చేసినవారు ఎవరు.. ఎందుకు చేశారు? అనేది తెలియరాలేదు. ఇటివల ఇటువంటి కాల్స్ వస్తున్నాయని నాగేశ్వర్ కూడా అంటున్నారు. ఏకంగా ఏడుసార్లు బెదిరింపు కాల్స్ రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల జూలై 25 నుంచి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని నాగేశ్వర్ అంటున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చేశారు. ఉస్మానియా, యూనివర్శిటీలో జర్నలిజం ప్రొఫెసర్ అయిన నాగేశ్వర్ పలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఆయన యూట్యూబ్ వీడియో చానెల్ లో కూడా సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీస్ దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. గతంలో పర్యావరణ, అటవీ, వన్యప్రాణిలో లెజిస్లేటివ్ కమిటీల్లో వర్క్ చేశారు.
88013 481589There is noticeably a lot of money to recognize about this. I suppose you produced certain nice points in functions also. 408565
321146 83990I enjoy this internet site, will certainly arrive back. Make confident you carry on writing high quality posts. 260450
686507 984290What cell phone browser is this internet site page optimized for Internet explorer? 349619