రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేట్టు లేవు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈమేరకు రాష్ట్రంలోని మొత్తం 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మార్చి 10న, మున్సిపాలిటీల్లో జూన్ 30న, నగర పంచాయతీల్లో జూలై 2న ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. అయితే కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంతో శ్రీకాకుళం కార్పొరేషన్లో అక్టోబర్ 10 వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగించింది. మిగిలిన అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో డిసెంబర్ 31 వరకు ప్రత్యేకాధికారుల పాలన ఉండేలా.. లేదంటే పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో కూడా వచ్చే 2021 జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు పురపాలక శాఖ నొటిఫికేషన్లో పేర్కొంది. మొత్తాంగా మొన్నటి ఆర్డినెన్స్, ప్రస్తుత ఉత్వర్వులను పరిశీలిస్తే ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ ఉండదని ప్రభుత్వం సంకేతాలిచ్చిందనే చెప్పాలి.
888074 605760Thanks for helping out, outstanding information. 379862