త్రిష .. దాదాపు దశాబ్డా కలం పాటు సౌత్ లో టాప్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న త్రిషకు ఛాన్సులు తగ్గడంతో ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ అమ్మడికి 96 సంచలన విజయాన్ని అందించింది.
ఆ హిట్ తో త్రిష డిమాండ్ బాగా పెరిగిందని, ఆ తరువాత తనకు నచ్చినట్టు ఉంటూ, సినిమాలు చేస్తుంది. తాజాగా పరమపదం విలయట్టు అనే సినిమాలో నటిస్తుంది. తిరుజ్ఞానం అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హీరోయిన్ త్రిష డుమ్మా కొట్టడంతో .. ఈ సినిమా టీమ్ బాగా డిసప్పాయింట్ అయింది. త్రిష ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో దర్శక, నిర్మాతలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ముక్యంగా నిర్మాత టి శివ హీరోయిన్ త్రిష పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు నటించిన సినిమాలకే సరైన ప్రమోషన్ లేకపోతె ప్రేక్షకులు అస్సలు థియేటర్స్ కె రావడం లేదు .. అంటూ ఘాటుగా స్పందించారు.
అందరు కొత్త వారితో కేవలం త్రిష మెయిన్ లీడ్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు ఆమె ప్రమోషన్ కు రాకుండా, తప్పించుకుని తిరగడం ఏమి బాగాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాల ప్రమోషన్ విషయంలో స్టార్స్ సపోర్ట్ చేయకుంటే సినిమాల పరిస్థితి, నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు నిర్మాత. మరి ఈ విషయంలో త్రిష ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
910966 564776This is really intriguing, You are a really skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking a lot more of your magnificent post. Also, Ive shared your internet internet site in my social networks! 228562
223873 301417But wanna admit that this is quite useful , Thanks for taking your time to write this. 998192