అన్న నందమూరి తారకరామారావు రెండో సతీమణి లక్ష్మి పార్వతి గురించి అందరికి తెలుసు. ఎన్టీఆర్ మరణం తరువాత ఎన్టీఆర్ పేరుతొ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మి పార్వతి ఆ తరువాత ఎన్నికల్లో ఓటమిపాలవడంతో రాజకీయాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు.
అయితే ఈమె సినిమాల్లోకి వస్తుందంటూ కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్నా సంగతి తెలిసిందే. లక్ష్మి పార్వతిని సినిమా రంగంలోకి పరిచయం చేస్తున్నది ఎవరో కాదు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత పలు సినిమాలు తీశారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అయన తాజాగా రాగల 24 గంటల్లో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలోనే లక్ష్మి పార్వతి కీ రోల్ పోషిస్తుందట. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తీ చేసుకుందట. అయితే తాజాగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడుతున్నారంటూ క్రేజ్ ఏర్పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రాధాకృష్ణ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
సో త్వరలోనే ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తారట. అంత బాగానే ఉంది కానీ ఈ సినిమాకు రాధాకృష్ణ అనే టైటిల్ పెట్టడంలో అంతరార్థం ఏమిటా ? అన్న సందేహాలు .. ప్రేక్షకులతో పాటు సినీ జనాల్లో ఉంది మరి !!
705648 437703A really fascinating read, I might nicely not agree totally, but you do make some quite legitimate factors. 416843