అప్పుడే పుట్టిన శిశువులకు తల్లిపాలు తప్ప ఇంకే పట్టొద్దని డాక్లర్లు చెబుతారు. బిడ్డకు కనీసం ఆరు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలను మించిన ఆహారం, ఔషధం లేదన్నది వాస్తవం. ఎంతగా ఎక్కువగా తల్లిపాలు తాగితే వారిలో రోగనిరోధక శక్తి అంతగా పెరుగుతుంది. అందుకే తల్లిపాలు పట్టే విషయంలో అనవసర అపోహలు పెట్టుకోవద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఓ మాతృమూర్తి తన శిశువుకు పాలివ్వడమే కాకుండా ఏకంగా 60 మంది శిశువులకు తన చనుబాలను దానంచేసి వార్తల్లో నిలిచారు. హిందీ సినిమా నిర్మాత నిధి పార్మర్ హీరానందాని ఇంత గొప్ప పనిచేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. 42 ఏళ్ల వయసులో నిధి ఇటీవల తల్లయ్యారు. తన శిశువుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో తెలుసుకుని క్రమం తప్పకుండా చనుబాలు ఇస్తున్నారు.
అయితే, తన శిశువుకు పాలిచ్చిన తర్వాత కూడా చాలా పాలు వస్తుండటంతో వాటిని చనుబాలు అందుబాటులో లేని శిశువులకు దానం చేస్తే బాగుంటుందని భావించారు. ఇదే విషయాన్ని ఓ ఆస్పత్రికి వెళ్లి తెలిపారు. అనంతరం వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలతో చనుబాలు తీసి ఆ ఆస్పత్రికి అందజేయడం మొదలుపెట్టారు.
ఇలా ఈ ఏడాడి మే నుంచి ఇప్పటివరకు దాదాపు 42 లీటర్ల పాలు దానం చేశారు. ఆ ఆస్పత్రి యాజమాన్యం వాటిని దాదాపు 60 మంది శిశువులకు పట్టిస్తున్నారు. దీంతో మరో ఏడాదిపాటు తన పాలను అలాగే దానం చేయాలని నిధి నిర్ణయించుకున్నారు.
తాను ఒకరికే జన్మనిచ్చినా.. మరో 60 మందికి తన పాలు ఇవ్వడం ద్వారా వారికి కూడా తల్లయ్యారు. తమ అందం పాడైపోతుందని సొంత బిడ్డలకే పాలివ్వడానికి జంకేవారు కనిపించే ఈ రోజుల్లో.. ఇలా ఏకంగా 60 మందికి చనుబాలు అందజేస్తున్న నిధి నిజంగా గ్రేట్ కదూ? హ్యాట్సాఫ్ నిధీ..!
982109 565905I think this web site contains some extremely excellent information for everyone : D. 152881