ఇటీవల పదవీవిరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్, హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో జరిగిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులను పావులుగా వాడుకునే ఉద్దేశమే ‘దళిత బంధు’ పధకం ఉద్దేశమన్నారు.
‘ఆ నిధులతో పేద విద్యార్థుల చదువులకు, ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఉపయోగించొచ్చు. ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజూరాబాద్ ఉప ఎన్నికప్పుడే ఎందుకొచ్చిందో కేసీఆర్ చెప్పాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో దోచుకున్న 50 వేల కోట్లను, తీసుకున్న కమీషన్లను ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు’.
‘ఎవరెస్టు అధిరోహించిన మాలావత్ పూర్ణకు కామారెడ్డిలో 300 గజాల స్థలం.., సింధూకు బంజారాహిల్స్లో స్థలం..! ఇది వివక్షకు కాదా? అని నిలదీశారు. మన పిల్లల బతుకులు మారాలంటే బహుజన రాజ్య స్థాపనే అంతిమ లక్ష్యంగా పోరాడాలి. రాష్ట్రంలో గులాబీ జెండా స్థానంలో నీలి జెండా రావాలి. కరీంనగర్లో తనను కలిసిన ఇద్దరు బహుజన చిరుద్యోగులపై కక్షగట్టి సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని.. తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ బిడ్డలను ఏం చేస్తారని ప్రవీణ్కుమార్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
401870 267859This internet internet site is often a walk-through for all of the knowledge you wanted concerning this and didnt know who ought to. Glimpse here, and you will definitely discover it. 705923
711075 887390Wow, wonderful blog layout! How long have you been blogging for? you make blogging look simple. The overall appear of your internet site is amazing, let alone the content! 860680
492486 811641Merely wanna input on couple of common items, The site layout is perfect, the articles is really excellent : D. 999340