Kalki 2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడి’ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా పై ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్ తో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకునే మరియు దిశా పటానీ హీరోయిన్ లుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమా లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను దర్శకుడు చూపించబోతున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవల జరిగిన షెడ్యూల్ తో సినిమా ను పూర్తి చేసినట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా ప్రకటించారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయబోతున్నారు. ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.