బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే మూడు వారాల క్రితం శామ్ బాంబేను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఇద్దరు గోవాకు వెళ్లారు. అక్కడ శామ్ బాంబే వేదిస్తున్నాడని చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ పూనమ్ పాండే లైంగిక వేదింపుల కేసు పెట్టింది. పెళ్లి అయిన రెండు వారాలకే ఆమె కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. భర్తతో ఆమె విడిపోయినట్లేనా అంటూ అంతా అనుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
భర్తపై పెట్టిన కేసు విషయంలో పూనమ్ పాండే యూ టర్న్ తీసుకుంది. అనూహ్యంగా ఆమె తన కేసును వెనక్కు తీసుకోవడంతో పాటు భర్తను క్షమిస్తున్నట్లుగా ప్రకటించింది. తన భర్త శామ్ బాంబే తాను చేసిన పనికి కన్నీరు పెట్టుకున్నారు. నాకు క్షమాపణ చెప్పి ఏడ్వడంతో నేను అతడిపై పెట్టిన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. రెండు వారాల్లోనే భర్తపై ఫిర్యాదు చేసిన పూనం పాండే జీవితాంతం అతడితో కలిసి ఉండటం సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కలిసి పోయినా మళ్లీ వారి మద్య గొడవలు రావు అనే విషయమై నమ్మకం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
807863 125857I enjoy your writing style really enjoying this internet internet site . 403443