పూజా హెగ్డే ఒక్కసారిగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ అమ్మడు అల వైకుంఠపురంలో చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకుంది. హిట్స్ లేని సమయంలోనే ఈ అమ్మడి జోరు కొనసాగింది. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ పడటంతో పూజా హెగ్డేను ఆపతరమా చెప్పండి. ప్రస్తుతం ప్రభాస్20వ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో మరో రెండు సినిమాలకు సైన్ చేసిందట. ఇక బాలీవుడ్లో సల్మాన్కు జోడీగా నటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి.
ఇదే సమయంలో ఈ అమ్మడు తమిళంలో రీ ఎంట్రీకి సిద్దం అయ్యిందని తమిళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్గా తమిళంలో కెరీర్ను ప్రారంభించిన పూజా హెగ్డే మళ్లీ తమిళంలో హీరోయిన్గా నటించేందుకు ఇన్నాళ్లకు ఓకే చెప్పిందనేది ఆ ప్రచారం సారాంశం. హీరో సూర్యతో కలిసి పూజా హెగ్డే సినిమాలో నటించబోతుందంటూ గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చి పడ్డాయి.
ఆ వార్తలపై పూజ హెగ్డే స్పందించింది. ట్విట్టర్లో ఈ అమ్మడు ఆ విషయమై.. హలో హలో నేను ప్రస్తుతం తమిళ చిత్రంలో నటిస్తున్నట్లుగా చేస్తున్న ప్రచారంను ఆపేయండి. నేను ఇప్పటి వరకు ఏ తమిళ సినిమాకు కూడా సైన్ చేయలేదు. రెండు మూడు తమిళ స్క్రిప్ట్లు విన్నాను కాని ఓకే చెప్పలేదు. కాని నాకు తమిళంలో సినిమాలు చేయాలనే ఆసక్తి మాత్రం ఉందని క్లారిటీ ఇచ్చింది. నేను ఏదైనా కొత్త సినిమాకు ఓకే చెప్తే తప్పకుండా మీకు సమాచారం అందిస్తానంటూ చెప్పుకొచ్చింది.
515822 379716An intriguing discussion will probably be worth comment. I feel that you just write much a lot more about this subject, it may possibly become a taboo subject but usually consumers are inadequate to communicate in on such topics. To another. Cheers 603506