క్రమక్రమంగా దేశంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ తగ్గుతూ వస్తోంది. జనం రోడ్ల మీదకు చాలా ఎక్కువగానే వచ్చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతలా హెచ్చరిస్తున్నా, జనంలో మార్పు రావడంలేదు. ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. ఇంకోపక్క కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినాసరే, జనం లెక్క చేయకపోవడాన్ని కేంద్రం చాలా సీరియస్గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.
రేపు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్రం నుంచి మరో సంచలన నిర్ణయం వెలుగు చూడొచ్చనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘రాష్ట్రాలు ఖచ్చితంగా లాక్ డౌన్ని అమలు చేసి తీరాల్సిందే..’ అని పదే పదే కేంద్ర హోంశాఖ సూచిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నా, ప్రజల్లో మార్పు రాకపోవడం గమనార్హం.
‘కుంటి సాకులు’ చెబుతూ జనం రోడ్ల మీదకు వస్తున్నారంటూ పోలీసులు వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాల్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు.. రకరకాలుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.. అయినాగానీ, జనం మారడంలేదాయె. లాక్డౌన్ మొదలయ్యా కొద్ది రోజులు పరిస్థితి అదుపులోనే వున్నా, ఇప్పుడది అదుపు తప్పుతోంది.
దాంతో, జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కావడంలేదు. ఈ పరిస్థితే దేశంలో కేసుల సంఖ్య పెరగడానికీ కారణమవుతోందన్న చర్చ తెరపైకొచ్చింది. నిజానికి, ఇప్పుడే అత్యంత కీలకమైన ఫేజ్లోకి దేశం ఎంటర్ అయ్యింది. రెండో ఫేజ్ నుంచి మూడో ఫేజ్లోకి ఎంటర్ అయ్యే సమయమిది. ఈ సమయంలో, లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తే, కొద్ది రోజుల్లో లాక్డౌన్ నుంచి దేశం ఉపశమనం పొందే అవకాశముంటుంది. లేదంటే, దఫలవారీగా లాక్డౌన్ని పెంచుకుంటూ పోవాల్సి రావొచ్చేమో.!
58944 305107Real instructive and fantastic anatomical structure of articles , now thats user pleasant (:. 552870
249252 252110This is the sort of details Ive long been in search of. Thanks for posting this details. 90960