ప్రశాంతంగా ఉండే కోనసీమలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని.. ప్రజలు సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో కోరారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని అన్నారు. ఘటనను హోంమంత్రి టీడీపీపై నెట్టాడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అమలాపురం ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. పాలనాపరమైన తప్పులు కప్పిపుచ్చేందుకే సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. హోం మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అమలాపురం ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.
అమలాపురం ఘటనను పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తీవ్రంగా ఖండించారు. కోనసీమను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. కోనసీమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ప్రజలు సంయమనం పాటించి శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని నేతలు కోరారు.
420588 774704I really like the appear of your website. I lately built mine and I was searching for some tips for my web site and you gave me a few. Might I ask you whether you developed the website by youself? 553312