తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి సమీపంలో ఉన్న అమరారెడ్డి నగర్ వాసుల ఇళ్లు ఖాళీ చేయించే క్రమంలో ఓ యువతిని పోలీసులు స్టేషన్ కు పిలవడం విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా నివశించే శివశ్రీ గతంలో వాలంటీరుగా పని చేసి ఉద్యోగానికి రిజైన్ చేసింది. అయితే.. రోడ్ల వెడల్పు చేయడంలో భాగంగా స్థానికంగా నివాసముంటున్నవారిని ఖాళీ చేసి వేరే చోటికి నివాసం వెళ్లాలని ఆదేశించారు. దీంతో శివశ్రీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి సమస్య వివరించింది.
దీంతో పోలీసులు కక్షగట్టి తమ కుమార్తెను పోలీసులు స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శివశ్రీని పోలిస్ స్టేషన్ కు పిలివడం ఇది రెండోసారని అంటున్నారు. రెండు రోజుల క్రితం సాయంత్రం 6:30 కి పిలిచి రాత్రి 10గంటల వరకూ స్టేషన్ లో ఉంచారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేకా రామిరెడ్డి అనే వ్యక్తి పేరు చెప్పినందుకు తమ కుమార్తెను పోలీసులు వేధిస్తున్నారని వారు అంటున్నారు.
899612 871821Really instructive and superb structure of articles, now thats user friendly (:. 78999