ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం వచ్చే లోక్ సభ ఎన్నికలకు ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మార్చి 10నే హోలీ పండుగ వచ్చినట్టుంది. బీజేపీ సుపరిపాలన వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ఈ విజయంలో మహిళలు, యువతదే కీలకపాత్ర. యూపీ ఎన్నికల్లో విచ్ఛిన్నకర శక్తుల్ని ప్రజలు పక్కన పెట్టారు. 37 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఇప్పుడే జరిగింది’.
‘క్లిష్ట సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆత్మనిర్భర్ భారత్ కు కొత్త శక్తిని అందించాం. కొత్తగా ఓటు వేసిన యువత అభివృద్ది కోరుకున్నారు.. బీజేపీ వైపే నిలబడ్డారు. కొందరు కరోనా వ్యాక్సిన్ ను ప్రశ్నించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో “ఆపరేషన్ గంగ”ను ఆపేందుకు ప్రయత్నించారు. ఏదొక రోజు వారసత్వ రాజకీయాలు అంతమవుతాయి. భవిష్యత్తులో పంజాబ్ లో కూడా బీజేపీ జెండా ఎగురేస్తాం’ అని అన్నారు.
374919 256904Excellent post, I conceive site owners really should learn a whole lot from this web blog its rattling user genial . 133982
335074 115872Exceptional post however , I was wanting to know if you could write a litte much more on this topic? Id be very thankful if you could elaborate a little bit far more. Thanks! 86253