తెలంగాణ అసెంబ్లీలో బడ్డెట్ పద్దు సందర్భంగా కేటీఆర్, భట్టి విక్రమార్క మధ్య స్వల్ప వాగ్వాదం జరగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించగా.. సభలో లేని వ్యక్తి గురించి వ్యాఖ్యానించడం సంస్కారం కాదని అన్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డికే సంస్కారం లేదని అనడంతో సభలో వాగ్వాదం జరిగింది. జరిగిందేమిటంటే..
‘బీజేపీ నాయకుల్ని స్పీకర్ సస్సెండ్ చేస్తే ఆ పార్టీ నేతలకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నాడు. అవిభక్త కవలలేమో మాకు అర్ధం కావడం లేదు. భట్టి విక్రమార్క మంచివారే అయినా.. అక్కడ గట్టి అక్రమార్కులు ఉండటం వల్ల ఆయనది నడుస్తలేదు’ అని అన్నారు.
దీనికి భట్టి స్పందిస్తూ.. ‘బీజేపీ నేతల సస్పెన్షన్ పై నేనేమీ స్పందించలేదు. కానీ.. వారిని సస్పెండ్ చేసిన తీరు బాలేదని అన్నాను. రేవంత్ రెడ్డి ఎంపీ. ఆయన సభలో లేరు. ఇక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరైంది కాదు. దయచేసి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’ అన్నారు.
417522 205398Read more on that great Post, I linked to you Thanks. 792463