విశాఖలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ నిన్న జరిగిన ఘటనలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవస్థాపరమైన లోపాలపైనే జనసేన మాట్లాడుతుందని.. వైసీపీ నేతలు మాత్రం బూతుల పంచాంగం తప్పితే మరేమీ మాట్లాడటం లేదని అన్నారు. బూతులు తిట్టడానికి మాత్రమే వైసీపీ వికేంద్రీకరణలా పరిస్థితులు ఉండటం శోచనీయమని అన్నారు. నిజంగా ఉత్తరాంధ్ర, రాయలసీమపై వైసీపీ ప్రభుత్వానికి అంత ప్రేమ ఉందా అని ప్రశ్నించారు.
‘సీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చారని.. అయినా రాయలసీమ ఇంకా వెనుకబడే ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర నాయకుల్లో వెనుకబాటు లేకపోయినా ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నారని అన్నారు. కడుపు కాలి, సమస్యల్లో ఉన్నవారు గర్జనలు చేస్తారు కానీ.. అధికారంలో ఉండి ప్రభత్వం గర్జనలు చేయడమేంటని పవన్ ఎద్దేవా చేశారు. పోలీసులపై తమకు గౌరవం ఉందని.. అందుకే నిన్న చాలా పద్ధతిగా ఉన్నామని అన్నారు. వైకాపా గూండాల ఉడుత ఊపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నన్ను చంపుతారనే వదంతులు బాధించాయని పవన్ అన్నారు.
530809 665068Id ought to seek advice from you here. Which is not something I do! I enjoy reading an write-up that could make people feel. Also, a lot of thanks allowing me to comment! 225379
595959 460312As I website owner I believe the articles here is truly great , thankyou for your efforts. 388063
736364 106112some genuinely choice content on this internet web site , saved to my bookmarks . 37660