‘ఒక వ్యక్తి గొంతును 48 శాఖలు, 28 మంత్రులు, 5గురు డిప్యూటీ సీఎంలు ప్రతిబింబిస్తే అది వికేంద్రీకరణా..? అధికారాన్ని మీ గుప్పిట్లో పెట్టుకుని వికేంద్రీకరణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. పేరుకే మంత్రులు.. అధికారం ఎక్కడుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జడ్పీలు, స్థానిక సంస్థలకు నిధులు వెళ్లాలా వద్దా అని నిర్ణయించేది ఆ ఒక్క గొంతుకే అని మండిపడ్డారు. 30లక్షల మంది భవన కార్మికులకు చెందిన 400కోట్ల నిధులను ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని కూడా అదే గొంతు నిర్ణయిస్తోందని అన్నారు. డబ్బులు వచ్చేవాటికి కేంద్రీకరణ అంటూ.. గొడవలు పెడుతూ.. బూతులు తిట్టడానికి మాత్రం మూడు రాజధానులని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అదానీ డేటా సెంటర్, లులు గ్రూప్ అమరరాజా బ్యాటరీస్ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేసిన ఆ ఒక్క గొంతు రాజధాని వికేంద్రీకరణ అంటూ కబుర్లు చెప్తున్నారని అన్నారు. ఉద్యమం అనేది నాయకులు పుట్టిస్తే రాదని.. ప్రజల్లో నుంచి వస్తుందని పవన్ అన్నారు.
435106 532599quite good post, i undoubtedly adore this amazing internet site, carry on it 835540