గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. చలనచిత్ర రంగంలో ఆయనకి ఉన్న విశేష ఆదరణకి, సేవలకి గాను ఈ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) హర్షం వ్యక్తం చేస్తూ చరణ్ కి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
‘ చలనచిత్ర రంగంలో తనదైన శైలిలో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు. తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న సేవలకు గాను ఈ గౌరవాన్ని ప్రకటించడం హర్షనీయం. ఈ స్ఫూర్తితో ఆయన మరిన్ని చిత్రాలు చేసి మరిన్ని పురస్కారాలతో ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ తన నోట్ లో పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే చెర్రీ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాని కథానాయిక. ఇటీవలే చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘జరగండి’ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. దీంతోపాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు.
రామ్ చరణ్ కు అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan @AlwaysRamCharan#RamCharan pic.twitter.com/UGgMvC9KzO
— JanaSena Party (@JanaSenaParty) April 12, 2024