దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే.. కరోనా మృతుల అంత్యక్రియలు పెద్ద సమస్యగా మారుతోంది. స్మశనవాటికల్లో క్యూలు పెరిగిపోతున్నాయి. సిబ్బంది కూడా ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారు. మృతి చెందిన వారితో ఎక్కడ వైరస్ సోకుతుందోననే భయంతో సొంతవారే అంత్యక్రియలకు రావడం లేదు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే అంత్యక్రియలు జరుపుతున్నారు. దీంతో కరోనా మృతుల అంత్యక్రియలు కొత్త బిజినెస్ అయింది.
అంత్యక్రియలు కట్టుదిట్టమైన జాగ్రత్తలతో, సంప్రదాయం ప్రకారమే నిర్వహిస్తామంటూ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. ఇందుకు 30 నుంచి 35వేలు వసూలు చేస్తున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్ ఏజెన్సీకి.. చెన్నై, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ నగరాల్లో బ్రాంచ్లున్నాయి. హైదరాబాద్లో గోల్డ్, సిల్వర్ అనే రెండు రకాల ప్యాకెజీలు ఉన్నాయి. రోజుకి 6 నుంచి 10 కాల్స్ వస్తున్నాయని అంటోంది సంస్థ.
147652 103805Thank you for your very good data and feedback from you. car dealers san jose 319610
720882 513567I really enjoy examining on this internet website , it has got excellent posts . 812413