ఇటివలే రెండో దశ ప్రయోగాలు విజయవంతమైనట్టు ప్రకటించింది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తమ భాగస్వామ్యంలో తయారవుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 2021 ఏప్రిల్ కు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా అన్నారు. 2021 ఫిబ్రవరిలో వలంటీర్లకు వ్యాక్సిన్ అందించే ఉద్దేశం ఉందని చెప్పారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో భాగంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ప్రయోగాల అనంతరం ఏప్రిల్ నుంచి ప్రజలందరికి ఈ వ్యాక్సిన్ ను విక్రయించే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. అనుమతులు, తుది దశలో క్లినికల్ పరీక్షల ఫలితాలపై వ్యాక్సిన్ ఆధారపడి ఉందన్నారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ రూ.1000కే లభించే అవకాశం ఉందని కూడా తెలిపారు. 2024కి ఈ వ్యాక్సిన్ దేశంలోని 80-90 శాతం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. వృద్ధుల్లో కూడా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతం అయిందని.. వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతోందని ప్రకటించింది. వ్యాక్సిన్ సరఫరాకు బడ్జెట్, మౌలిక సదుపాయాలు, ప్రజల ఆసక్తి వంటి అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు.
ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కారు చౌకగా వ్యాక్సిన్లను అందించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇటివలే తమ వ్యాక్సిన్కు యూకే, యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఎమర్జెన్సీ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఇవన్నీ వస్తే దేశీయంగా కూడా దరఖాస్తు చేయనున్నట్లు పూనావాలా తెలిపారు. ఈ వ్యాక్సిన్ను 2-8 సెల్సియస్లో భద్రపరచవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసేజీలు.. జులైకల్లా 40 కోట్ల డోసులు అవసరమవుతాయని అంచనా వేశారు.
774321 912096This really is one extremely interesting post. I like the way you write and I will bookmark your blog to my favorites. 688991