కరోనా ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్స్ లో రోజురోజుకీ నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతోంది. ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఇలాంటి నిర్లక్ష్య ఘటనే ఉస్మానియా హాస్పిటల్ లో చోటు చేసుకుంది. ఓ ముస్లీమ్ కుటుంబానికి చికిత్స పొందుతున్న తమ కుటుంబ మహిళా చనిపోయిందంటూ ఫోన్ వెళ్ళింది. తీరా వాళ్ళు వచ్చాక మహిళ బాడీని అప్పగించే ప్రాసెస్ లో ఓ హై డ్రామానే నడిచింది.
చివరికి ఆ కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యురాలు బ్రతికే ఉందని తెలుసుకొని ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీయగా.. వివరాలు మరొకసారి చెక్ చేసుకొని నాలిక్కరుచుకున్నారు. అసలు విష్యం ఏమిటంటే.. ఒకే పేరుతో ఉస్మానియాలో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతున్నారు. దాంతో ఒకరికి చేయాల్సిన ఫోన్ ఇంకొకరి చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. కానీ నిజాలు తెలిసే లోపు హాస్పిటల్ సిబ్బంది ఆ కుటుంబ సభ్యులకు చుక్కలు చూపించింది. దాంతో వారందరూ ఉస్మానియా హాస్పిటల్ బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#Hyderabad, ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగుతున్న నిర్లక్ష్య ధోరణి. బ్రతికున్న మహిళను చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసిన యాజమాన్యం.ఒకే పేరుతో ఇద్దరు పేషంట్స్ ఉండడం వలెనే ఈ తప్పు జరిగిందంటున్న హాస్పిటల్ సిబ్బంది. #KTR #KCR @KTR_News @KTRoffice #Telangana #COVID19 pic.twitter.com/kLrCKWhpVr
— TeluguBulletin.com (@TeluguBulletin) June 22, 2020
939228 898139replica watches are amazing reproduction of original authentic swiss luxury time pieces. 312086
151327 959953Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 792472
214734 559641I dugg some of you post as I thought they were handy very beneficial 837545