తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే నాయకురాలు శశికళను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడి జైలులో ఉన్న ఆమెకు తాజాగా ఆదాయపన్ను శాఖ మరో షాక్ ఇచ్చింది. చెన్నైవ్యాప్తంగా ఉన్న రూ.300 కోట్ల విలువ చేసే 65 ఆస్తులను సోమవారం ఐటీశాఖ అధికారులు అటాచ్ చేశారు. పోయెస్ గార్డెన్ దగ్గర ఉన్న 10 అంతస్తుల భవనం కూడా ఇందులో ఉంది. ఇవన్నీ షెల్ కంపెనీల ద్వారా కూడబెట్టినట్టు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
శశికళ 1995లో శ్రీహరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఓ బినామీ కంపెనీ స్థాపించారని, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్రతినిధులుగా ఉన్న కలియపెరుముల్, శివకుమార్ లు శశికళకు సంబంధం ఉన్న ఇతర కంపెనీలతో కూడా లావాదేవీలు సాగించినట్టు తేలింది. వీటిలో జజ్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మిదాస్ గోల్డెన్ డిస్ట్రిలటరీ ప్రైవేట్ లిమిటెడ్ లు ఇందులో ఉన్నాయి.
2003 నుంచి 2005 మధ్యకాలంలో 200 ఎకరాలు సహా మొత్తం 65 ఆస్తులు కూడబెట్టినట్టు తెలిపారు. వీటి ప్రస్తుత విలువ రూ.300 కోట్లు ఉంటుందని వివరించారు. అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు సమయంలో పలు బినామీ కంపెనీలు ద్వారా శశిశకళ రూ.1600 కోట్ల మేర లావాదేవీలు కూడా జరిపిన సంగతిని అధికారులు గుర్తించారు. ఆ సమయంలో తన వద్ద భారీగా ఉన్న రూ.500, 1000 నోట్లను ఆమె మార్పిడి చేశారని.. పౌష్టికాహార పథకం కాంట్రాక్టర్ కు రూ.237 కోట్ల రుణం కూడా ఇచ్చిన సంగతి వెల్లడైందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై శశికళకు నోటీసులు కూడా జారీచేశామని పేర్కొన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో నాలుగేళ్ల శిక్ష పడటంతో ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది ఆమె విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఆస్తుల అటాచ్ చేయడం కలకలం రేపింది.
824325 609560Would adore to always get updated excellent site ! . 378447