ఇటీవలే ఎస్ ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ కుటుంబానికి కరోనా సోకిందని, హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రెండు వారాలు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రాజమౌళి కుటుంబం, కరోనా నుండి కోలుకుంది. తర్వాత చేసిన టెస్టుల్లో అందరికీ నెగటివ్ వచ్చింది.
అయితే తమలో యాంటీ బాడీస్ పెంపొందించుకున్న తర్వాత ప్లాస్మాను డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి ప్లాస్మా, సీరియస్ గా ఉన్న కరోనా బాధితులకు ఎంతో సహాయం చేస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ప్లాస్మాను డొనేట్ చేయమని ప్రచారం చేస్తున్నాయి.
ఇక చెప్పిన ప్రకారంగానే ఈరోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, అతని కొడుకు కాల భైరవ కలిసి ఈరోజు ప్లాస్మా దానం చేసారు. ప్రముఖ కిమ్స్ ఆసుపత్రిలో వీరు యాంటీ బాడీస్ ను టెస్ట్ చేయించుకున్న తర్వాత వీరు ప్లాస్మాను దానమిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ విడివిడిగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేసారు. కాల భైరవ తన ట్వీట్ లో ఇది చాలా సులువైన ప్రక్రియ.. కరోనా నుండి కోలుకున్న అందరూ కచ్చితంగా ప్లాస్మాను దానం చేయండి అని అన్నాడు.
కాల భైరవ సంగీతం అందించిన కలర్ ఫోటో చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. కీరవాణి ఆర్ ఆర్ ఆర్ కు, పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే.
830796 502871Ive writers block that comes and goes and I want to locate a approach to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any ideas? 916050
354631 281926Currently it seems like BlogEngine is the greatest blogging platform out there right now. (from what Ive read) Is that what youre utilizing on your weblog? 909853