ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మద్య తరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో చాలా కష్టాలు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితితో చితికి పోయిన సింగపూర్ జనాలు సంతానంపై ఆసక్తి చూపడం లేదట. ఈ సంక్షోభంలో పిల్లలను కనడం ఆర్థిక భారంగా భావిస్తున్నట్లుగా నిర్థారణ అయ్యింది. ఆ కారణంగానే అక్కడి ప్రభుత్వం తల్లిదండ్రులు కాబోతున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఇప్పటికే అక్కడి ప్రభుత్వం నవజాత శిశువుకు పది వేల డాలర్లను బేబీ బోనస్ కింద ఇస్తున్నారు. ఇప్పుడు దానికి అదనంగా మరింత మొత్తంను తల్లిదండ్రులకు ఇవ్వబోతున్నట్లుగా పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆర్థిక భారంతో ఉన్న వారికి ఇది చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. సింగపూర్ జనాభ పెరుగుదల కోసం చాలా కాలంగా అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సంతానోత్పత్తి పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొత్తగా ఈ విధానంను తీసుకు వచ్చారు.
495241 819594Gratitude for building this send! I in reality comprehend the no cost info. 257961
836876 817988How considerably of an exciting piece of writing, continue creating companion 797964