అటు శర్వానంద్ కానీ ఇటు సాయి పల్లవి కానీ ఇద్దరికీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లుగా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్ లకు, వీరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. దర్శకత్వ లోపం వల్ల, అతిగా ఖర్చు పెట్టడం వల్ల పడి పడి లేచే మనసు వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ జోడి మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అనే రైతుల సబ్జెక్ట్ పై తెరకెక్కుతోన్న సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సమ్మర్ కు విడుదల కానుంది. దీని తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలీదు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ మే లేదా జూన్ నుండి మొదలుకావచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. కిషోర్ తిరుమల ప్రస్తుతం రామ్ తో రెడ్ సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ 9న విడుదల కాగా దాని తర్వాత శర్వానంద్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాను లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
658291 918119Oh my goodness! an superb article dude. Thank you Nevertheless Im experiencing issue with ur rss . Do not know why Cannot register for it. Could there be any person finding identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 120138
880756 137635The next time I just read a weblog, I actually hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something fascinating to convey. All I hear can be a handful of whining about something you can fix in the event you werent too busy trying to discover attention. 140411