స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 20వ సినిమా ‘పుష్ప’ ని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ చిత్ర షూటింగ్ కోవిడ్ -19 పరిస్థితుల వలన ఆగింది. ఆగిన సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి, థియేటర్స్ ఎప్పుడు మళ్ళీ తెరుచుకుంటాయి అనేదానిపై క్లారిటీ లేదు కానీ అల్లు అర్జున్ మాత్రం తన 21వ సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
చెప్పాలంటే అల్లు అర్జున్ దిల్ రాజు బ్యానర్ లో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా కమిట్ అయ్యాడు. కానీ దానిని ఇప్పటికే ఒకటి రెండు సార్లు వెనక్కి నెట్టారు. అంతే కాకుండా ఇప్పుడు కూడా దానిని పక్కనపెట్టి కొరటాల శివ సినిమా అనౌన్స్ చేయడంతో దిల్ రాజు కూడా ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ బదులు వేరే స్టార్ హీరోస్ ని రీప్లేస్ చేసే పనిలో ఉన్నారు.
అందులో భాగంగా ఇప్పటికే దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. స్వతహాగానే వీరిద్దరితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ తో ఐకాన్ స్క్రిప్ట్ విని ఈ ఇద్దరిలో ఎవరికైనా నచ్చితే వారితో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ‘ఐకాన్’ ప్రాజెక్ట్ లో సెట్ అవుతాడో వేచి చూడాల్సి ఉంది.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దిల్ రాజు ప్రొడక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇంకా 30% షూటింగ్ బాలన్స్ ఉంది.
27739 970143What cell phone browser is this internet site page optimized for Internet explorer? 650549