‘ప్రజా గాయకుడు’ అనగానే తెలుగునాట గద్దర్ పేరు విన్పిస్తుంది. కానీ, ఆ స్థాయి ‘గొంతుక’ ఇంకొకటి వుంది. ఆయనే వంగపండు ప్రసాదరావు. వెనుకబాటుతనానికి కేరాఫ్ అడ్రస్ కదా.. అందుకే, ఉత్తరాంధ్రకి చెందిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు పాట కూడా తొక్కివేయబడింది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ..’ అంటే వెంటనే ‘మగధీర’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ గుర్తుకొస్తుంది. కానీ, ఒకప్పుడు అది వేలాదిమంది.. లక్షలాదిమందిని కదిలించిన పాట.
బహుశా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓ ముప్పయ్యేళ్ళ క్రితం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాట పాడని వారంటూ ఎవరూ వుండరేమో. అంతలా జనాన్ని కదిలించింది ఆ పాట. ఇలాంటి ఎన్నో పాటల్ని రచించి, పాడిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో మృతి చెందారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఏనాడూ వంగపండు ప్రసాదరావు తన పాటని అమ్ముకోలేదు. అదీ ఆయన ప్రత్యేకత. ఆయన పాటల్లోని పదాలు ప్రజల్ని కదిలించేవి.
ఉత్తరాంధ్ర యాసని ఆయన తన పాటల్లో పలికించిన తీరు అద్భుతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయంలో సమైక్య ఉద్యమం కోసం కూడా గళం విప్పారు వంగపండు ప్రసాదరావు. కొందరు రాజకీయ నాయకులు ఆయన్ని ‘వాడుకునేందుకు’ ప్రయత్నించినా, చాలా సందర్భాల్లో ఆయన సున్నితంగా తిరస్కరించారు.
తమ రాజకీయ ప్రత్యర్థులపైకి వంగపండు పాటని అస్త్రంలా సంధించేందుకు జరిగిన ప్రయత్నాల్నీ ఆయన తప్పుపట్టారు. ‘పాటంటే నాకు ప్రాణం.. ఎందుకంటే, పాట అనేది పీడిత ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనేది నా నమ్మకం..’ అంటారు వంగపండు ప్రసాదరావు.
వంగపండు, ప్రజా గాయకుడు గద్దర్కి అత్యంత సన్నిహితుడు. పీడిత ప్రజల కోసం నినదించిన వంగపండు పాట, ఉత్తరాంధ్రలోనే కాదు, తెలంగాణలోనూ సత్తా చాటింది. ఏదిఏమైనా, ఉత్తరాంధ్ర గొంతుక వంగపండు ప్రసాదరావుతో మూగబోయింది. మళ్ళీ ‘ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన యాసతో పాట’ ఇంకో నోట ఆ స్థాయిలో వినగలమా.? ఛాన్సే లేదు.
724727 85606An interesting discussion is worth comment. I do believe that you need to write read much more about this topic, it will not be considered a taboo subject but normally every person is too few to communicate in on such topics. To yet another. Cheers 477998