Shanthi Swaroop: తొలి తెలుగు న్యూస్ రీడర్ గా సుపరిచితులైన ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanthi Swaroop) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటివల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండె నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
అయితే.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. దూరదర్శన్ (Doordarshan) చానెల్లో వార్తలు చదివిన ఆయన.. తొలి తెలుగు న్యూస్ రీడర్ గా టీవీ వీక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రతి రోజూ సాయంత్రం 7.30 గంటలకు వచ్చే వార్తల్లో శాంతి స్వరూప్ వార్తలు చదివేవారు. పదేళ్లపాటు టెలి ప్రాంప్టర్ లేకుండా పేపర్ చేసి వార్తలు చదివేవారు.
ఆయన వార్తలు చదివే శైలికి అభిమానులు ఉన్నారు. 1983లో వార్తలు చదవడం ప్రారంభించిన నాటి నుంచి 2011లో రిటైర్ అయ్యేవరకూ దూరదర్శన్ లో పని చేశారు. ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా దక్కింది.