శంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. మొదట్లో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు.. ద్వారా మాత్రమే కరోనా ప్రధాన లక్షణాలుగా ఉండేవి. కానీ.. పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ కొత్తకొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది ఈ మహమ్మారి. ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్న వారు కొందరైతే మరికొందరు కొత్తకొత్త లక్షణాలతో వైరస్ బారిన పడుతున్నారు. ఈమేరకు సెంటర్స్ ఫర్ డిసీసీ కంట్రోల అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ లక్షణాలను గుర్తించింది.
ఇందులో కొత్తగా కొంతమంది వాసన గ్రహించలేకపోవడం కూడా జరుగుతోంది. ఇది కూడా కరోనా సోకిందనడానికి ఓ సింప్టమ్ అంటున్నారు. మరికొంతమందికి వాంతులు, విరేచనాలు, తలనొప్పి.. కూడా యాడ్ అవుతున్నాయి.
సీడీసీ నివేదిక ప్రకారం కరోనా లక్షణాలివే..
1. జ్వరం – చలి జ్వరం 2. దగ్గు 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం 4. ఆయాసం 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు 6. తలనొప్పి 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం 8. గొంతునొప్పి 9. జలుబు 10. వాంతులు 11. విరేచనాలు
ఈ లక్షణాలు ఏమాత్రం ఉన్నా అలక్ష్యం వహించొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వెంటనే వైద్య పరిక్షలు చేయించుకోవాలని అంటున్నారు. కొత్త లక్షణాలు వైద్యులకు సవాల్ గా మారాయని కూడా అంటున్నారు. కొత్తగా పాజిటివ్ వస్తున్న వారిలో కొత్త లక్షణాలు ఉంటున్నాయని సీడీసీ తెలిపింది.
526166 566440I came towards the exact conclusion as well some time ago. Fantastic write-up and I will be positive to look back later for much more news. 70758
739547 607105I saw lots of web site but I feel this 1 contains something unique in it in it 995891