స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రానున్న సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూడోసారి చేస్తున్న ఈ కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది.
అలాగే ప్రస్తుతం ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సన్ టీవీ నెట్ వర్క్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
కానీ కొద్దీ రోజుల క్రితం మా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎర్లీగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రాదు అని ప్రమోట్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాతలైన అల్లు అరవింద్ – చినబాబు కలిసి ఈ సినిమాని డిజిటల్ రైట్స్ ని ది టాప్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ కి అమ్మారని తెలుస్తోంది.
ఈ ఒక్క సినిమానే కాకుండా అల్లు అర్జున్ నటించబోయే నెక్స్ట్ 2 సినిమాలను కూడా కంలిపి టోటల్ గా 3 సినిమాలు నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేలా ఓ భారీ మొత్తానికి కాంట్రాక్ట్ చేసారని సమాచారం.
‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.
