సీనియర్ నటుడు నరేష్ గత కొన్నాళ్లుగా నటి పవిత్ర లోకేష్ తో సహ జీవనంలో ఉన్నాడు. హైదరాబాద్ లో ఇద్దరు కలిసే ఉంటున్నారు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా వారి వారి భార్య మరియు భర్తతో విడి పోయి ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరి మద్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ప్రస్తుతానికి సహ జీవనం సాగిస్తున్నారు.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరేష్ మూడవ భార్య అయిన రమ్య మీడియా ముందుకు వచ్చింది. నరేష్ మరియు పవిత్ర లపై విమర్శలు చేసింది.
ఈ నేపథ్యంలో నరేష్ స్పందించాడు. పవిత్ర లోకేష్ తో తనకు మంచి స్నేహం మాత్రమే ఉంది. ఇద్దరి మద్య స్నేహం ఏర్పడటం అనేది చాలా సహజమైన విషయం. అలాగే మా ఇద్దరి మద్య కూడా స్నేహం ఏర్పడింది. రమ్య మానసిక పరిస్థితి బాగా లేదు అని చాలా రోజులుగా డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఆమె అలా మాట్లాడుతూ ఉంది. పవిత్ర మా ఫ్యామిలీ ఫ్రెండ్.
కనుక ప్రతి చిన్న కార్యక్రమం కు కూడా ఆమె హాజరు అవుతుంది. ఆమె మాత్రమే కాకుండా మా స్నేహితులు ఎంతో మంది మా ఇంటి కార్యక్రమాల్లో హాజరు అవుతారు అన్నట్లుగా నరేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పవిత్ర లోకేష్ తో తనది ప్రేమ కాదు.. ఫ్రెండ్ షిప్ అంటూ నరేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కాని జనాలు మీడియా వారు మాత్రం ఇంకా అనుమానంగానే ఉన్నారు.
116969 841894I enjoy what you guys are usually up too. This kind of clever function and reporting! Maintain up the really great works guys Ive added you guys to blogroll. 78524
554488 925437Some truly fascinating info , effectively written and broadly speaking user pleasant. 945881
323222 373979I enjoy your writing style genuinely enjoying this internet site . 829287