Nara Lokesh and Vangaveeti Radha: తెలుగు మీడియా దిగజారుడుతనానికి ఇదొక నిదర్శనం అనుకోవాలా.? అంతేనేమో.! తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ విషయంలో ఎప్పుడో పాతాళపు అంచులకి చేరిపోయింది. వైసీపీ అనుకూల మీడియా సంగతి సరే సరి. ఈ అను‘కుల’ మీడియా కారణంగా, మొత్తంగా తెలుగు మీడియానే భ్రష్టుపట్టిపోయే పరిస్థితి.
అసలు విషయానికొస్తే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ – వంగవీటి రాధాకృష్ణ కలిసి, కూర్చుని మాట్లాడుకున్నారు.. అదీ అసలు విషయం.
‘ఏకాంతంగా భేటీ.. కారవాన్లో మనసు విప్పి మాట్లాడుకున్న నేతలు..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా న్యూస్ ఛానళ్ళలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్లకు సహజంగానే వైసీపీ అను‘కుల’ మీడియా నుంచి కౌంటర్ ఎటాక్స్ పడ్డాయి. పడతాయి కూడా.. అదీ జుగుప్సాకరమైన రీతిలో.
ఇదీ, తెలుగు మీడియాలో ఓ రెండు ప్రధాన వర్గాల తీరు.! గతంలో వైసీపీలో పనిచేసిన వంగవీటి రాధాకృష్ణ, ఆ తర్వాత టీడీపీలో చేరారు. సో, ఆయనిప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కలిస్తే.. అది వింత ఎలా అవుతుంది.?
వంగవీటి రాధాకృష్ణని తమవైపుకు మళ్ళీ లాగేందుకు తెరవెనుక వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మరోపక్క, వంగవీటి రాధాకృష్ణ జనసేనతోనూ టచ్లో వున్నారనుకోండి.. అది వేరే సంగతి. వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీకి పెద్దగా ఉపయోగం వుండదని గతంలోనే తేలిపోయింది. కాకపోతే, వంగవీటి రంగా తనయుడు గనుక.. ఆయన పొలిటికల్ మూమెంట్స్పై ఓ వర్గం మీడియా స్పెషల్ ఫోకస్ పెడుతుంటుందంతే.
167071 853024Sweet internet internet site , super design , actually clean and utilize genial . 538968