ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కు త్వరలో తెర లేవబోతోంది. మరో 11 రోజుల్లో ఐపీఎల్ సమరం ఆరంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో గత ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ కొత్త లుక్ లో తన అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు తన జట్టు కొత్త జెర్సీని తాజాగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తదితర ఆటగాళ్లు తమ విజయాలకు సంబంధించి మాట్లాడిన ఓ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఒక జట్టు.. ఒక కుటుంబం.. ఒక జెర్సీ అనే ట్యాగ్ టైన్ కూడా జతచేసింది.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో వరుసగా తాము మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఆ ఘనత సాధించాలని ముంబై ఇండియన్స్ తహతహలాడుతోంది. మరి ఈ సీజన్ ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే మే 30 వరకు ఆగక తప్పదు.
658320 708811Not long noticed concerning your internet web site and are nonetheless already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Good weblog. ill be bookmarking keep visiting this internet website really usually. 359866
919400 336288This is a excellent weblog. Maintain up all of the function. I too enjoy to weblog. This really is excellent every person sharing opinions 34520
511094 365378As I internet site owner I feel the subject material here is real fantastic, appreciate it for your efforts. 56996